Process Begins Of issuing Tirumala Srivari Darshan Tokens To Locals : స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లను జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతిలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలో ఉన్న మహతి ఆడిటోరియంలో ఈవో శ్యామలరావు, తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన స్థానికులకు టోకెన్లను అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతోనే స్థానికులకు శ్రీవారి దర్శనం ప్రారభించామని వెల్లడించారు.